సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బీజేపీ ఎమ్మెల్సీ
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 10 : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) బీజేపీ ఎమ్మెల్సీ ఏ వి ఎన్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. రామంతపూర్ వెంకట సాయి నగర్( సాయి కృష్ణానగర్), చెందిన మధ్య బోయిన జ్యోతి భర్త శివకు,42,000 బాలకృష్ణ నగర్ కు చెందిన మానస తండ్రి కి 29,000 /- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్సీ ఏ వి ఎన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏ వి ఎన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఏ విజయేందర్ రెడ్డి, మధ్య బోయిన ఐలేష్ యాదవ్, రమేష్, రాజు, మధ్య బోయిన శివ యాదవ్, ఆర్ గోవింద్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, అశోక్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.