సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి
యదార్థవాది ప్రతినిది ఆర్మూర్
భారతీయ జనతా గిరిజన మోర్ఛ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశయాల, ఆదర్శాల కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని, సేవాలాల్ మహారాజ్ ఆశయాలను మనమందరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గిరిజన మోర్ఛ నాయకులు గూగులోత్ తిరుపతి నాయక్ పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.