29.2 C
Hyderabad
Wednesday, May 21, 2025
హోమ్తెలంగాణసోషల్ మీడియాలో గుర్తింపు కొసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.

సోషల్ మీడియాలో గుర్తింపు కొసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.

సోషల్ మీడియాలో గుర్తింపు కొసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.

-ప్రజ సమస్యలను పరిష్కారానికి ధర్నాలే పరిష్కారం కాదు.

-కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు.

కరీంనగర్ యదార్ధవాది

ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, కార్మికులు విద్యార్థులు ధర్నాలు చేసే ప్రయత్నంలో శృతిమించి ప్రవర్తిస్తున్నారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పత్రిక ప్రకటనలు తెలిపారు.. ప్రజల సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకురావడానికి రాజకీయ నాయకులు, కార్మిక, విద్యార్థి సంఘా నాయకులు ధర్నాలు చేయడం సహజమే. ధర్నాలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే.. ఇటీవలి కాలంలో ధర్నాలు చేసే పద్ధతిలో సోషల్ మీడియా ప్రచారం కోసం పాకులాడుతూ ప్రభుత్వ కార్యాలయాల గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడం విధులలో ఉన్న అధికారులపై, పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అయన అన్నారు. కరీంనగర్ లో కూడా వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసే పద్ధతిలో ఒక విపరీతమైన ధోరణి కనిపిస్తోందని, ధర్నాలు చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు తమ వ్యక్తిగత గుర్తింపు కొరకు కలెక్టరేట్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడం, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులతో ఘర్షణ పడడం ఈమధ్య పెరిగిపోతున్నదిని దీనికి సోషల్ మీడియా ప్రభావం కూడా తోడవడంతో ప్రతి ఒక్కరు ధర్నాలలో గేట్లు ఎక్కే ఫోటోలు పోలీసులతో తోపులాడే ఫోటోలను వెంటనే సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో పెట్టుకుంటూ తమ గుర్తింపు కోసం పడే తాపత్రయం స్పష్టంగా కనబడుతుందని ఆయన అన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రజలకు సేవలందించే ఒక సేవ కేంద్రనికి ప్రతినిత్యం సామాన్యుడి నుండి మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు వేలాదిమంది తమ తమ పనుల నిమిత్తం, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ను సందర్శిస్తూ ఉంటారని, జిల్లా నలుములలనుండి వృద్ధులు, వికలాంగులు, మహిళలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కు వచ్చినప్పుడు ధర్నాల వల్ల తీవ్ర ఇబ్బందులు అసౌకర్యానికి గురవుతున్నరని, ధర్నాలు చేసే సంఘాల రాజకీయ పార్టీలు నాయకులు ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో వారి ధర్నాలు కొన్ని నిమిషాల పాటు చేసుకుని మీడియా ద్వారా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రాన్ని సమర్పించుకోని వెళ్ళాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల ఆస్తి ప్రత్యర్తి వర్గాల భూభాగం కాదని కూడా గ్రహించాలని, భారతీయ శిక్షా స్మృతి లో ‘విధి నిర్వహణలో ఉన్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన, దురుసుగా ప్రవర్తించిన, బెదిరింపులకు పాల్పడినా, నెట్టివేసిన, అరెస్టు చేసే క్రమంలో ప్రతిఘటించిన తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్