స్వామివారి సేవలో మంత్రి గంగుల కమలాకర్
యదార్థవాది ప్రతినిధి కరీంనగర్
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని శేష వాహనంపై ఊరేగించారు. ఈ శేష వాహన సేవ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ హరి శంకర్ స్వామివారి శేష వాహనాన్ని భుజ స్కందాలపై మోస్తూ. స్వామి వారి సేవలో తరించారు. ఐదో రోజు శేష వాహన సేవ అంగరంగ వైభవంగా.అన్నమయ్య సంకీర్తనలు కోలాట ముత్యాలతో వైభవంగా సాగింది. శేష వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.