హిందువులకు క్షమాపణ చెప్పాలి: దోనె అశోక్.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
హిందు దేవాలయల భూములు అమ్మి.. ముస్లింలను ఆదుకుంటం అని కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడాన్ని రాష్ట హిందూ ధర్మ రక్షణ సేవా సమితి అధ్యక్షులు దోనె అశోక్ ఖండించారు. గురువారం సిద్దిపేట జిల్లా పట్టణ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావడానకి పార్టిలు ముస్లిం కమ్యూనిటీలను ఆకట్టుకోవడానికి, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అన్నారు. ముస్లిం డిక్లరేషన్ కొరకు నిధులు ఎలా సేకరిస్తారని ఇటీవల ఓ న్యూస్ ఛానల్ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంలో బాగంగా హిందూ దేవాలయల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలా అంటరాని, ముస్లిం లపైన మీకు ప్రేమ ఉంటే వారిని ఆదుకోండి కానీ హిందూ దేవాలయ భూములను వేలం వేయుటకు మీరు ఎవరని ఆయన ప్రశ్నించారు. మీ రాజకీయ లబ్ది కోసం హిందువులను చులకనగా చేస్తూ దేవాలయ భూములను వేలం వేస్తాం అంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని, గతంలో కూడా హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుందని ఇప్పటికైనా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేకుంటే రానున్న రోజులలో నీకు, మీ పార్టీకి హిందూ సమాజం తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో న్యాయవాది శేషు కుమార్ బింగి వినయ్ తదితరులు పాల్గొన్నారు.