హోం మంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలి
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఇరుగు రాళ్ల శ్రీనివాస్
కమాన్ పూర్ యదార్థవాది డిసెంబర్ 21: పార్లమెంటులో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించే విధంగా ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కేంద్ర కమిటీ సభ్యుడు కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన ఇరుగు రాళ్ల శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. దేశ శాంతి భద్రతులకు విఘాతం కలిగించే విధంగా ప్రసంగించినందుకు వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంబేద్కర్ పై ఎటువంటి కామెంట్లు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని లేనిపక్షంలో అంబేద్కర్ వాదుల కోపాగ్నికి బలి అయితావు అని హెచ్చరించారు.