25.2 C
Hyderabad
Thursday, September 10, 2026
హోమ్తెలంగాణఅంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన: జేఎస్అర్

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన: జేఎస్అర్

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన: జేఎస్అర్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ప్రభుత్వం వెంటనే అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్లు గత 11 రోజులుగా చేస్తున్న సమ్మెకు గురువారం జన్నపురెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలు పట్టించుకోవడంలేదని అంగన్వాడిల
కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని వారి న్యాయపరమైన సమస్యలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు అంగన్ వాడి సిబ్బంది పై బెదిరింపు దోరణి మానుకోవాలని, అంగాన్ వాడి సిబ్బంది కి భారతీయ జనతా పార్టీ ఎల్లపుడూ అండగా వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వి రాజ్ గౌడ్, గోదాల సంపత్,శ్రీరామోజు శ్రీనివాస్, వేణు, రంజిత్, ఆంగన్ వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్