27.5 C
Hyderabad
Wednesday, September 16, 2026
హోమ్తెలంగాణఅధికారులను వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

అధికారులను వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

అధికారులను వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ అధికారులను ఖాళీ సీట్లు వెక్కిరిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30 లోపు పన్నులు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రోత్సాహకంగా కలిపించింది. దీని ద్వారా ప్రజలకు మేలు కలగడంతో పాటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో కల్పించిన ఈ అవకాశానికి అధికారుల తీరుతో తూట్లు పొడుస్తున్నారు. మున్సిపల్ శాఖ సకాలంలో ప్రజలు అన్ని రకాల బిల్లులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించలనే దేశంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది అయితే వివిధ రకాల బిల్లులు చెల్లించడానికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.. ఉసురు మంటూ ఎండలో పడిగాపులు పడుతూ బిల్లులు చెల్లించడానికి వస్తే కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో అధికారుల తీరుపట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నరు. నాన అవస్థలు పడి ఆటో ఛార్జీలు పెట్టుకొని కార్యాలయానికి వస్తె బిల్లులు తీసుకోవడం కి ఎవరూ లేకపోవడంతో చేసేదేమి లేక వెను తిరిగి వెళ్ళిపోతున్నారు. కాగా ఈ విషయమై అధికారులను వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఎవరు అందుబాటులో లేరు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్