24.3 C
Hyderabad
Friday, July 31, 2026
హోమ్తెలంగాణఏడుపాయల జాతరకు నిధులు మంజూరు

ఏడుపాయల జాతరకు నిధులు మంజూరు

ఏడుపాయల జాతరకు నిధులు మంజూరు

యదార్థవాది ప్రతినిధి మెదక్
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వన దుర్గ మాత జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కోట్లు రూ మంజూరు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పండుగలు, జాతరలు వైభవంగా జరుగుతున్నాయని అన్నారు ఏడుపాయల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయులే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని జాతరలో భక్తులకు మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రెండు కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సహకరించిన జిల్లా మంత్రి హరీష్ రావుకి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్