34.2 C
Hyderabad
Thursday, September 17, 2026
హోమ్తెలంగాణగణతంత్ర పర్వం భారత జాతికి గర్వం

గణతంత్ర పర్వం భారత జాతికి గర్వం

గణతంత్ర పండుగ ఆనందాల వెల్లువ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

భారతజాతి అస్తిత్వం, గణతంత్ర దినోత్సవ జంఢా పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో బుధవారం ఇండియన్ యూనిటీ, గణతంత్ర దినోత్సవ చిత్రాలను ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి. ఆయన మాట్లాడుతూ ‘భారత దేశ, గణతంత్ర పర్వం’ భారత జాతికి గర్వం’ ఆనందాలే సర్వం. భారత జాతి దాస్య శృంఖలాలను  ఎందరో త్యాగదనుల పుణ్యఫలం మనం అనుభవించే భారత స్వాతంత్య్రం. కల్పించిన లౌకిక భారత రాజ్యాంగం, ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన అస్తిత్వ భాధ్యత. బీ ఆర్ అంబేడ్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం, మానవజాతి కే గర్వకారణం ప్రపంచానికి మార్గదర్శనం. మానవీయ పరిరక్షణ మహా రక్షణకవచం మన రాజ్యాంగం. అందరికి శాంతి భద్రతలు సుఖ సంతోషాలు సహజీవనం సౌభాతృత్వం ఆచరణలో సఫలీకృతం కావాలని, ఇంకా స్వతంత్ర ఫలాలు అందని అభాగ్యులకు హక్కులు అందాలని, మత విద్వేషాలను, నిరుద్యోగాన్ని అధిగమించి అందరూ ఆనందంగా వుండాలని, అంబరం చుంబినా మువ్వన్నెల జెండా సంబురం భారతజాతి గుండెల్లోపదిలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం,ఎండి రహీం, గ్రైట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, మహ్మద్ సాధిక్, అబ్దుల్ ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్