27.7 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్తెలంగాణదొరలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్న

దొరలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్న

దొరలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్న

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

భారతదేశ తొలి బహుజనుల సామ్రాజ్య సృష్టికర్త గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్బంగా నిజామాబాద్ నగరంలోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కోట నుండి గోల్కొండ కోట వరకు దాదాపు 12 వేల మంది స్వసంత్ర సైనికులతో సామ్రాజ్యాన్ని సృష్టించి న మహోన్నత వ్యక్తని కల్లు గీసే కత్తినే ఖడ్గంగా మార్చిన యోధుడని నవాబుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు రాజ్య సంపదను పేద ప్రజలకు పంచిన మహోనతుదని ఆ మహానియుడిని స్ఫూర్తిగా తీసుకుని దొరల పాలనపై తిరుగుబాటు చేయాలని శంకర్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ నగర ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ నగర యువజన అధ్యక్షులు సంతోష్ సీనియర్ నాయకులు ఆల్లకుంట పాండు తాల్ల సాగర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్