భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి
యదార్థవాది ప్రతినిధి పెద్దపల్లి
రామగుండం పోలీస్ నూతన కమిషనర్ గా రెమా రాజేశ్వరి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ చేరుకున్న కమిషనర్ కు సాయుధ పోలీసులు గౌరవద్దనం సమర్పించారు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని న్యాయాన్ని ధర్మానికి లోబడి చట్టబద్దంగా సామన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడ సేవలందిచడంలో కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ కలిసి పుష్పాగుచ్చాలను అందజేసిన వారు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, సీపీ సిసి శ్రావణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచ లింగం, సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.