24.7 C
Hyderabad
Sunday, April 19, 2026
హోమ్తెలంగాణమత్స్యావతారంలో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి

మత్స్యావతారంలో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి

మత్స్యావతారంలో పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: సూర్యాపేట జిల్లా పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి పూజలు చేశారు. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో కొలువుదీరిన లక్ష్మీనాధునికి ప్రతి శుక్రవారం విశేష పుష్పాలంకరణ ఫలాలంకరణ సేవా కార్యక్రమాలు జరుగుతాయని ప్రతినెల శుక్లపక్ష ఏకాదశి నాడు స్వామివారి మాస కల్యాణము, ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సహస్రదీపాలంకరణ సహిత ఊంజల్ (ఉయ్యాల) సేవ నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ చైర్మన్ గూగంటి రాజాబాబు రెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. ఒన్ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భక్తిశ్రద్ధలతో పాల్గొని నెలరోజుల పాటు జరిగే ధనుర్మాసం వత మహోత్సవాలను ఘనంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందగట్ల రాంబాబు మంగపండ్ల మల్లికార్జున్ చెరుకుపల్లి క్రిష్టయ్య చెరుకుపల్లి సైదమ్మ మల్లయ్య తూటిపల్లి జానయ్య గంపల శంకర్ అంకంభిక్షం మహిళా భక్తులు ముడుంభై సారిక,గూకంటి స్వరూప,గవ్వ విజయలక్ష్మి, సువర్ణ,అహల్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్