రోడు ప్రమాదంలో మహిళ మృతి
హుస్నాబాద్ యదార్థవాది
సిద్దిపేట జిల్లా ములుగు వద్ద రోడు ప్రమాదంలో గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద మృతి..
పల్లెటూర్లలో బతుకుదెరువు కరువై జీవనోపాధి కోసం వలస వెళ్లిన బెజ్జంకి మండలం గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద కోహెడ మండలం బసాపురం తన తల్లి గారి ఇంటికి వచ్చి తిరిగి జీవనోపాధి కోసం వెళుతున్న క్రమంలో గురువారం ఉదయం ములుగు క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన శారదకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది..