32.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణవడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన: మంత్రి హరీష్

వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన: మంత్రి హరీష్

వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన: మంత్రి హరీష్

సిద్ధిపేట యదార్థవాది

సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో గ్రామాలలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రైతులతో మాట్లాడుతూ
వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రైతు నాయకుడు ఉన్నటువంటి రైతు ప్రభుత్వం రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభత్వం ఆదుకుంటుందని ప్రతి గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్కరైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి సూచించారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయి. నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయని, ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అన్నీ జిల్లాలో మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్