11వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు..
నిజామాబాద్ యదార్ధవాది
తెలంగాణ విద్యార్థి పరిషత్ 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థి పరిషత్ నాయకులు,కార్యకర్తలు, విద్యార్థులు ఆదివారం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా సంస్థ పతాకాన్ని ఆవిష్కరించి. మిఠాయి పంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉద్యమాలలో పురుడోసుకొని విద్యార్థి ఉద్యమాలే దేయంగ ముందుకు వెళ్తున్న సంస్థ అని తెలంగాణ విద్యార్థి పరిషత్ లో కార్యకర్త,జిల్లా నాయకుడిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం అక్కడినుండి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త ధన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనం భానుచందర్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో పాటు రక్తదానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2012 జూలై 30 వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఏర్పడిన సంస్థ ఆనాటి ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసి ఉద్యమించిన సంస్థ పార్లమెంట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడితో సమైక్య వాదుల,తెలంగాణ ద్రోహుల పిచం అనిచిన సంస్థ ఈ తెలంగాణ విద్యార్థి పరిషత్ అని కొనియాడారు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్య, నిరుద్యోగం పై బలమైన గళం వినిపించి ఉద్యమించిన సంస్థ రాష్ట్ర సాధన స్వప్నాన్ని నెరవేర్చుకునే వరకు విశ్రమించలేదని అదేవిధంగా రాష్ట్రం సిద్ధించిన తర్వాత స్వారాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై సగటు విద్యార్థి సంక్షేమంపై మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలపై ఉద్యమిస్తు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ కుల మత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ రాజకీయ పార్టీకి అంటకాగకుండా కేవలం విద్యారంగ అభివృద్ధియే సంస్థ యేజెండ మార్చుకొని పోరాడుతున్న సంస్థని ఇక ముందు కూడా ఇదే విధంగా తెలంగాణ విద్యార్థుల కోసం విద్యారంగం కోసం నిరంతర ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. రక్తదాన శిబిరంలో 15 మంది రక్త దానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ అనిరుద్రాజ్, సాంఘిక సంక్షేమ హాస్టల్ ఇన్చార్జ్ ఎర్ర ప్రవీణ్, కార్యకర్తలు వినయ్,సాయి,గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు