రేపు సిద్దిపేట జిల్లా శాలివాహన (కుమ్మర) కార్యవర్గ ఎన్నికలు..
-నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు
-పలు అంశాలపై చర్చ..తీర్మానాలు..
సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది
ఈనెల 30 ఆదివారం సిద్దిపేట జిల్లా శాలివాహన (కుమ్మర్ల) సంఘానికి నూతన కార్యవర్గ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యవర్గ అడక్ కమిటీ నాయకులు జయంతి రావు ఆధ్వర్యంలో శాలివాహన జిల్లా నూతన బాడీ ఎన్నిక జరుగునని న్యాయవాది వరుకోలు రాజలింగం తెలిపారు.. కుమ్మర కుల బంధువులు మేధావులు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మండల కమిటీ బాధ్యులు పాల్గొనాలని తెలిపారు.. సిద్దిపేట నీలిమ గార్డెన్ లో ఉదయం 10 గంటలకు జరిగే ఎన్నికలల్లో సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.. జిల్లాకు సంబంధించిన కుమ్మరుల అభివృద్ధికై చర్చావేదికలో పాల్గొనాలని సూచించారు..
- కుమ్మర్ల అభివృద్ధి..
- రానున్న ఎలక్షన్లలో కుమ్మరులకు ప్రయోజనం..
- మంత్రి తన్నీరు హరీష్ రావు కుమ్మర్లకు కేటాయించిన పైలెట్ ప్రాజెక్టు..
- సంఘానికి కేటాయించిన రెండు ఎకరాలను ఏవిధంగా అభివృద్ధిపై..
- శంకర్ నగర్ లోని శాలివాహనులకు కేటాయించిన 200 గజాల అభివృద్ధిపై..
- మండలాల కమిటీలు ఏర్పాటుకై..
- ప్రతి గ్రామంలో తొలి బోనం..
- చేతివృత్తుల మిషనరీల కోసం ప్రభుత్వానికి నివేదిక..
- కుమ్మరి వృత్తికి అవసరమైన
మట్టికి ఎదురవుతున్న ఇబ్బందులను
ప్రభుత్వ దృష్టికి.. - ప్రతి మండల్ కేంద్రంలో కుమ్మర భవన నిర్మాణం కోసం..
- సిద్దిపేట జిల్లా స్థాయి శాలివాహన కుమ్మర్ల నూతన కమిటీ ఏర్పాటు..