5వ రోజు ఘనంగా ఉపవాస ప్రార్థనలు
క్రైస్తవ ఉపవాస పండగలకు హాజరైన డాక్టర్ చెంగల జోసెఫ్
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో క్రిస్మస్ పండగ ముందు జరుగు ఉపవాస ప్రార్థనలు కూడికలు ఐదవ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ చెంగల జోసెఫ్ హాజరయ్యారు. ఆయా గ్రామాల క్రైస్తవ సోదరులు, సోదరీమణులు ఆయా సంఘాల పాస్టర్లు మైలారం సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రార్థన కూడికలు మైలారం పాస్టర్ డాక్టర్ చెంగల జోసెఫ్ సమక్షంలో జరుగుతున్నాయని అని గ్రామస్థులు తెలిపారు.