క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందగలం
క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందగలం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించరు.. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందని, క్రమశిక్షణ తో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకు మంచి పేరు తెచ్చే లాగా పని చేయాలని తెలిపారు. ఈ పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ విశ్వప్రసాద్, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేంద్, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు, ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

