వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం…
యదార్థవాది ప్రతినిధి డిచ్ పల్లి
మండల కేంద్రంలో గల కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల లో భాగంగా మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి రాజారాం హల్దె దంపతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి రథోత్సవాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడతానని ఈ సందర్భంగా రాజారాం హల్దె తెలిపారు.. అనంతరం కిల్లా రామాయణాన్ని సందర్శించి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రవి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు