23.8 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్తెలంగాణచెక్ డ్యాం వద్ద గంగమ్మకు పూజలు

చెక్ డ్యాం వద్ద గంగమ్మకు పూజలు

చెక్ డ్యాం వద్ద గంగమ్మకు పూజలు

యదార్థవాది ప్రతినిధి గజ్వేల్

గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో నీ కూడవెల్లి వాగు చెక్ డ్యాం వద్ద గంగమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం ప్రత్యేకమైన పూజలు చేశారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాల దృష్ట్యా కాలేశ్వరం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసి మండుటెండర్ల సైతం రైతుల పొలాలకు గోదావరి నీళ్లను పారించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు, ఈరోజు గజ్వేల్ ప్రాంతంలో చేబర్తి చెరువు నుండి ప్రారంభమై మర్కుక్, జగదేపూర్, గజ్వేల్ మండలంలోని కొడకండ్ల బూరుగుపల్లి సింగాటం అందిపూర్ పిడిచేట్ కొల్గురు, సిరిసిల్ల నుండి హైయర్ మానేరు వరకు 36 చెక్ డ్యాం లు నిండుకుండలా నిండుతూ హయ్యర్ మానేరు వరకు గోదావరి జిల్లాలు వెళ్తాయన్నారు, కూడవెల్లి వాగు ఇరువైపుల రైతులకు వేల ఎకరాల్లో మండుటెండర్ల సైతం భయపడకుండా రైతుల పంట పొలాలకు జలాలను పారిస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి, మండల కో ఆప్షన్ అబ్దుల్, రాజు, చంద్ర గౌడ్, స్వామి, భాస్కర్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాహద్, సత్తయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్