34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఆణిముత్యం..వరుకోలు.. "జాతీయ సేవా రత్న" పురస్కారానికి ఎంపిక.

ఆణిముత్యం..వరుకోలు.. “జాతీయ సేవా రత్న” పురస్కారానికి ఎంపిక.

ఆణిముత్యం..వరుకోలు.. “జాతీయ సేవా రత్న” పురస్కారానికి ఎంపిక.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, రామనిపట్ల గ్రామానికి చెందిన

విద్యావేత్త ప్రముఖ న్యాయవాది మాజీ సర్పంచ్ (భర్త), ప్రముఖ సంఘ సేవకులు వరుకోలు రాజలింగం “జాతీయ సేవ రత్న-2024” పురస్కారానికి ఎంపికయ్యారు. 

హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ (B.S.A.) జాతీయ అవార్డు కమిటి ప్రకటించింది. ఈ అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్  చైర్మన్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ వెల్లడించి ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్ లోని కార్యాలయంలో అందజేశారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కవులు కళాకారులు రచయితలు స్వచ్ఛంద సంస్థలు ప్రముఖ సంఘ సేవకులకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 

వచ్చేనెల 11న బహుజన రైటర్స్ ఏడవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ సేవారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వరుకోలు రాజలింగంకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ,తమిళనాడు కేరళ కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600కు పైగా ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్కు హాజరవుతున్నారని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎంత గొప్పగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవకు మారుపేరుగా వరుకోలు 

రాజలింగం చెప్పవచ్చుని అన్నారు.

ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయని ముఖ్యంగా విద్యార్థులకు ఆపదలో ఉన్నవారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికే కాకుండా రక్తదానం సేంద్రీయ వ్యవసాయం రైతులకు న్యాయసలహాలు  తదితర ఎన్నో అంశాల్లో తన సేవానిరతిని వరుకోలు రాజలింగం చాటుకున్నారు.

నిరుపేదలు ఎందరికో చదువుతో పాటు వారిని ప్రయోజకులుగా చేస్తూ అంతేకాక తన శ్రీమతిని  సర్పంచ్ గా గెలిపించుకొని ఆమె పేరిట కూడా తాను ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టరని పత్రిక ప్రకటనలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్