34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణకేంద్ర మంత్రి బండి చిత్రపటానికి పాలాభిషేకం

కేంద్ర మంత్రి బండి చిత్రపటానికి పాలాభిషేకం

కేంద్ర మంత్రి బండి చిత్రపటానికి పాలాభిషేకం

హుస్నాబాద్, యదార్ధవాది ప్రతినిధి, జనవరి 28: హుస్నాబాద్ నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధుల నుండి మూడు కోట్ల 30 లక్షలు రూపాయలను మంజూరు చేయించిన కేంద్రమంత్రి బండి సంజయ్ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ కోహెడ మండల మాజీ అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం ఆద్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈసందర్భగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కన్నపేట కు 50 లక్షలు హుస్నాబాద్ 10 లక్షలు బెజ్జంకి 50  లక్షలు కాగ  సూచన మేరకు కోహెడ మండలానికి 27 గ్రామాలకు ఎంపీ బండి సంజయ్ కృషితో రెండు కోట్ల 20 లక్షల నిధులను సిమెంట్ రోడ్లు డ్రైనేజీల కోసం మంజూరు చేయించుకోవడం జరిగిందని, గత ప్రభుత్వం ప్రొసీడింగ్ రానీయకుండా చాలాసార్లు అడ్డు తగిలినపప్పటికి పట్టుదలతో కేంద్ర మంత్రి సంజయ్ కు కోహెడ మండలంలోని 27 గ్రామాలకు ఈజిఎస్ స్పెషల్ గ్రాంట్స్ క్రింద సిసిరోడ్లు మంజూరు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కోహెడ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ మ్యాకల చెంద్రశేఖర్ రెడ్డి, ద్యాగాటీ సురేందర్, మ్యాకల రజినీకాంత్ రెడ్డి, చేను తిరుపతి,బొమ్మగాని శివకుమార్,అన్నడి లక్ష్మ రెడ్డి, చిగురు రాజిరెడ్డి,నరాల శ్రీకాంత్, అన్నడి మధుసుధన్ రెడ్డి, ఏడుమల రాజు,జాలిగాం సంపత్,నాగు అజయ్,గంగాడి అనిల్ రెడ్డి,ఖమ్మం రాజు,తుపాకుల లక్ష్మణ్, శాతవేణి హరీష్, పుట్ట లక్ష్మణ్, శ్రావణపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్