ఘనంగా మల్లన్న జాతర వేడుకలు
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో దమ్మన్నపేట్ గ్రామంలో మల్లన్న జాతర యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం వారు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని మల్లన్న గుడికి డప్పు వాయిద్యాలతో చేరుకున్నారు. మల్లన్న కి పూజలు నిర్వహించారు. పూలమాలలు వేసి నైవేద్యాలు అన్నప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దమన్న పేట గ్రామ ప్రజలు భక్తులు యాదవ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.