
జిల్లాలో మహిళా ఓటర్లు అధికం
* రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 36 వేల 544 మంది ఓటర్లు..
* 2లక్షల 23వేల 905 మహిళా ఓటర్లు..
సిరిసిల్ల: 5 జనవరి
జిల్లాకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా గురువారం వెల్లడైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4 లక్షల 36వేల 544మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లలో 2లక్షల 12వేల 469మంది పురుష ఓటర్లు ఉండగా, 2లక్షల 23వేల 905మంది మహిళా ఓటర్లు, ఇతర ఓటర్లు 14, సర్వీస్ ఓటర్లు 156 మంది ఉన్నారు.







