రాష్ట్రంలో 53 బార్లకు వేలం
అమరావతి, యదార్థవాది ప్రతినిధి:
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ.
ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.
23న దరఖాస్తులను పరిశీలిస్తారు… 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.
ఎంపికైన వారికి అదే రోజు అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.