సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలు
యదార్థవాది ప్రతినిది గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సాయిబాబా ను దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని దైవ నామ స్మరణ తోనే ముక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని అన్నారు సాయిబాబా వార్షికోత్సవం సందర్భంగా భక్తుల విరాళాలతో వెండి సింహాసనం దేవాలయానికి అందజేశారు, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దైవ నామ స్మరణ తో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజు పంతులు,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, యువకులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు