ఘనంగా భగీరథ మహర్షి జయంతి..
జగిత్యాల యదార్థవాది
జిల్లా సమీకృత సముదాయాల భవనంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించిన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, మంద మకరంద.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. చారిత్రక పురుషుల, సంఘ సంస్కర్తల, మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప సంప్రదాయని, ఆయా వర్గాలకు ఆత్మగౌరవ సూచికగా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలువడం గర్వకారణమని ప్రజల జీవవ ప్రమాణాల పేరుగుదలకు శాశ్వత పరిష్కారందిశగా ప్రణాళికాబద్ధంగా బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, సూపరింటెండెంట్లు, బిసి సంఘాల నాయకులు హరి అశోక్ కుమార్, ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.