భూకబ్జాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం: ఏసీపీ శ్రీనివాస్
-క్షణికావేశంలో మాత్రమే జరిగిన హత్యలు తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కాదు..
రామగుండం యదార్థవాది ప్రతినిది
భూకబ్జాలకు పాల్పడే ఎవరినైనా చట్టం ఉపేక్షించబొదని, వారిపై వారిపై పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ తులా శ్రీనివాస్ రావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. గురువారం ప్రముఖ తెలుగు దినపత్రికలో కలకలం రేపుతున్న భూమాఫియా, మళ్లీ అలజడి సృష్టిస్తున్న భూమాఫియా పేరిట వార్తా కథనాలపై వివరణ ఇస్తూ ఈ సంవత్సరంలో కోల్ బెల్ట్ ఏరియా గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంతాలలో ఒకే ఒక హత్య జరుగగా, అది కూడా జనవరి 29వ తేదీన గోదావరిఖని పట్టణంలో జరిగిన మంథని సుమన్ హత్య కేసు. ఇది వ్యక్తిగత కారణాలతో పాత కక్షలతో మాత్రమే జరిగినదని, రెండు రోజుల క్రితం ఎన్ టి పి సి లో జరిగిన మేకల లింగయ్య హత్య కూడా కేవలం తన ఎదుగుదలకు తన దూరపు బంధువైన మేకల లింగయ్య అడ్డొస్తున్నాడని వ్యక్తిగత ద్వేషం తోనే జరిగింది తప్ప ఇద్దరి మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హత్యకు దారి తీసే శత్రుత్వం లేకపోవడం గమనించలని అన్నారు. క్షణికావేశానికి పోయి ఆ క్షణికావేశంలో భౌతిక దాడులకు పాల్పడి ప్రాణాలు తీయడం వల్ల నష్టమే తప్ప ఎవరికి ఏ రకంగానూ మంచి జరగదని, ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన కుటుంబాలు రోడ్డున పడ్డాయని మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు తమ గృహ అవసరాలకు భూములు కొనుగోలు చేసుకున్నరని, వరి అన్న భూములు జాలకు గురి అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడినా సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన వారి ప్రవర్తన మార్చుకోవాలని,వారు మార్చుకొని ఎడల వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడానకి
కూడా ఉపేక్షించేది లేదని ఏసీపీ హెచ్చరించారు..