హైదరాబాద్ లో ఆల్ ఇండియా జిఎస్ఐ ఇండోర గేమ్స్ ప్రారంభం.
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
37వ ఆల్ ఇండియా జిఎస్ఐ ఇండోర్ గేమ్స్ ను హైదరాబాద్లోని వి-స్పోర్ట్స్ అకాడమీలో పద్మశ్రీ మిథాలీ రాజ్ ప్రారంభించారు. 2024 జనవరి 30-31 తేదీలలో జరుగుతున్న ఈ రెండు రోజుల ఈవెంట్కు రీజనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సి.హెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ జిఎస్ఐ ఇండోర్ గేమ్స్లో పాల్గొనడానికి పాల్గొనడానికి పలు కార్యాలయాలనుండి 150 మంది పాల్గొంటున్నారు. ఇండోర్ గేమ్స్ లో క్యారమ్స్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ చెస్ బ్రిడ్జ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఫిట్గా చురుగ్గా ఉండేందుకు క్రీడల ప్రాముఖ్యతను విహరిస్తూ జీవితంలో విజయానికి విలువలైన క్రమశిక్షణ అంకితభావం నిబద్ధత గల జీవితాన్ని ఆస్వాదించడానికి క్రీడలు ఏంతో తోడ్పడతాయని అన్నారు. సి.హెచ్. వెంకటేశ్వరరావు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రావడానికి అంగీకరించినందుకు మిథాలీ రాజ్ ను అభినందించారు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను పెంపొందించడానికి తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం కోసం జిఎస్ఐలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి పాల్గొనే వారందరూ ఆరోగ్యకరమైన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు ఎల్.పి.సింగ్ ఎస్.ఎన్. మహాపాత్రో అన్షుమన్ ఆచార్య కె.వి. మారుతి ఎం.ఎన్. ప్రవీణ్ లతో సంజయ్ చౌదరి శ్రీనివాసులు భూటియా దొర ఇతర అధికారులు పాల్గొన్నారు.