ఈ నెల 29 న జరగాల్సిన విజయ గర్జన సభ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభ వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే రేపు వరంగల్ హనుమకొండ జిల్లాల్లో జరగాల్సిన సీఎం కేసీఆర్ పర్యటన కూడా రద్దయింది.
నో టీకా నో సాలరీ…
దేశంలో కోవేట్ వ్యాక్సిన్ శరవేగంగా జరుగుతోంది ఇటీవల దోసెల పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అందుకుంది అయినా కొందరు వాటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సంబంధిత సంస్థలు. కనీసం ఒక్క dosuti కూడా తీసుకోనట్లయితే తే సదరు సిబ్బందికి జీతాలు పేర్కొంటున్నాయి .
ఎమోషనల్ అయిన సమంత…
సమంత మరోసారి ఎమోషనల్ అయింది. తన స్నేహితురాలు డాక్టర్ మంజుల పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో భావోద్వేగ భరితమైన కామెంట్స్ ను పోస్ట్ చేసింది. ఈ బర్త్డే పార్టీకి డైరెక్టర్ నంది నీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నీ లాంటి వ్యక్తి నాకు స్నేహితురాలు గా ఉండడం గొప్ప విషయం కష్ట సమయంలోనే నిజమైన స్నేహితులు తెలుసుతారు అని పోస్టు పెట్టింది.
మళ్లీ కామెంటేటర్గా శాస్త్రి…
ఇంతకాలం టీమిండియాకు కోచ్ గా సేవలందించిన రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్గా మారానున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉండగా వచ్చే ఏడాది ఇది జరుగుతుందని ప్రకటించాయి. ఈ మ్యాచ్ కు కామెంతేటర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. కోచ్ కాకముందు ఆయనే కామెంటేటర్ గా పనిచేసిన విషయం తెలిసింది తెలిసిందే.
29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ…
యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతుందని ఆర్మీ పిఆర్ఓ తెలిపారు. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 20 ఉదయం గంటలకు సికింద్రాబాద్ ఏవో సి సెంటర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు జాయిన్ ఇండియన్ ఆర్మీ.ఇన్.కో సంప్రదించాలని కోరారు.
పార్టీ మారిన వారు సచ్చిన వారితో సమానం : రేవంత్…
పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు సచ్చిన వాళ్ళ తో సమానం అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని, బాగా కష్టపడే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారిపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పీవీ సింధు డాన్స్ అదుర్స్…
డాన్స్ తో పీవీ సింధు అదరగొట్టారు. బ్యాడ్మింటన్ star పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు వేసుకొని డాన్స్ చేసి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పాప్ సింగర్ పాడిన లవ్ సొంగపై ఆధారగొట్టింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. కాంచీపురం లెహంగా లో పీవీ సింధు చేసిన డ్యాన్స్ అలరిస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
అన్ని అబద్ధాలే.. కెసిఆర్ పై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి…
కేంద్ర ప్రభుత్వంపై గత రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో .. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిచరు. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తెలంగాణాలో కెసిఆర్ రైతులను మభ్య పెడుతున్నారన్నారు. ఎన్ని బెదిరింపులు చేసినా, అతని మాటలకు ఎవరు భయపడరని, ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు తెలుగు రాష్ట్రాలలో.. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తూఉండేదని, బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో 2014లో 43 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, ప్రస్తుతం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం గన్నీ సంఖ్యలు కూడా ఇస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణలో రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన్యం ఉత్పత్తి అంచనా వేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 108 మెట్రిక్ టన్నులు ఉంటుందని కంటి చూపుతో రాష్ట్రప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి లేఖ రాశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షల మెట్రిక్ టన్నుల కే ఒప్పందం చేసుకొని, ఇప్పుడేమో 108 మెట్రిక్ టన్నులు కొనాలని అంటున్నారు.
ఇదిగో గంగవ్వ కొత్త ఇల్లు…
యూట్యూబ్ స్టార్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా తన కోరిక నెరవేర్చుకుంది. మల్యాల మండలం లంబాడి పల్లిలో కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మై విలేజ్ షో పేరుతో సంపాదించిన పేరుతో గంగవ్వ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.
శీతాకాలం కోసం సన్నద్ధమవుతున్న ఆర్మీ…
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు రెండో ఏడాది కూడా కొనసాగుతుండడంతో అక్కడ గస్తీపై భారత ఆర్మీ వెనక్కి తగ్గడం లేదు. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయే పరిస్థితుల్లో సైనికులకు తట్టుకుని విధులు నిర్వహించదానికి రేషన్ , మెడిసిన్, మందుగుండు సామాగ్రి సహా మొత్తం 80 రకాల వస్తువులను సరఫరా చేస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఒకొ సైనికుడిపై ఆర్మి 11 లక్షల రూపాయి ఖర్చు చేయనుంది.

















