31.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

మోడీ సభకు భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు

మోడీ సభకు భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు

సిద్దిపేట యదార్థవాది

తెలంగాణాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి పలు అబివృద్ది కార్యకమాలకు వస్తున్నా సందర్భంలో సిద్ధిపేట నుండి భారీగా తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు.. వరంగల్ లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడి సభలో పాల్గొనేందుకు శనివారం బిజెపి శ్రేణులు సిద్దిపేట జిల్లా నుండి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో మోడీ సభలో పాల్గొనడానికి బిజెపి శ్రేణులు తరలివచ్చారని, ప్రధాని పాల్గొన్న సభ విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.. బిజెపి నాయకులు విద్యాసాగర్, అంబటి బాలేష్ గౌడ్ వంగ రామచంద్రారెడ్డి, కోడూరి నరేష్, ఉపేందర్ రావు, పత్రి శ్రీనివాస్ యాదవ్, తొడుకునూరి వెంకటేశం ,గాడి పల్లి అరుణ రెడ్డి తదితరులు మోడీ సభకు బయలుదేరినారులో ఉన్నారు.

రాష్ట్ర అడ్వకేట్ జనరల్, హైకోర్టు జడ్జి లను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, పోలీస్ కమీషనర్

రాష్ట్ర అడ్వకేట్ జనరల్, హైకోర్టు జడ్జి లను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, పోలీస్ కమీషనర్

కరీంనగర్ యదార్థవాది

రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టు జడ్జి నవీన్ రావు లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు. హైకోర్టు జడ్జి నవీన్ రావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ఎమ్మెల్యే

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ఎమ్మెల్యే

కరీంనగర్ యదార్థవాది

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ తెలిపారు.. శనివారం మానకొండూర్ మండలంలోని గ్రామాలలో పర్యటించి కళ్యాణలక్ష్మి, సీఎమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. అన్నారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించి, తమ సానుభూతి తెలిపారు.. ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన దాంసాని అశోక్ రెడ్డి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాపాక శ్రవణ్ అనే ఇద్దరు బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల వేరు వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైనా రూ.4 లక్షల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అయన అందజేశారు..

కొలువు తీరిన నూతన పాలకవర్గం

కొలువు తీరిన నూతన పాలకవర్గం

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ దేవాలయం నూతన పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడు రేణుక ఎల్లమ్మను కోరుకుంటారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గ ఆలయ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎల్లప్పుడు భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధి తోడ్పడతారని, రేణుక ఎల్లమ్మ దేవాలయనికి అన్నివిధాలుగా తోడుపటు నావంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఆకుల రజిత, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిని బిఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాలో ఇంత నిర్లక్ష్యమా.!

ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాలో ఇంత నిర్లక్ష్యమా.!

-విధులు అక్కడ, సమావేశాలు ఇక్కడ.

-ఆశా వర్కర్లంటే ఇంత నిర్లక్ష్యమా.

-ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైద్యాధికారులు.

-వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.

-సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఆరోగ్యశాఖ డైరెక్టర్ జడ శ్రీనివాస్ రావు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ నిర్విరామంగా రాష్ట్రంలో పేదలకు వైద్యం అందేందుకు నిత్యం కృషి చేస్తుంటే సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు తమ సొంత జిల్లాలో డివిజన్ మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు మాత్రం ప్రభుత్వానిబంధనలు పట్టించుకోకుండా హుస్నాబాద్ డివిజన్ వైద్యాధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో విధులకు హాజరై ప్రజా ఆరోగ్యాన్ని అందరికీ అందించాల్సి వైద్యులు బాధ్యతాయుతంగా ఇక్కడ పనిచేయడం లేదని సమయపాలన కూడా పాటించకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలైన మీర్జాపుర్, అక్కన్నపెట, రామవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శాఖ ఉద్యోగులై ఉండి ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ రివ్యూ మీటింగ్ చూడాల్సిన వైద్యులు బాధ్యత మరిచి విధులు అక్కడ మిటింగ్ లు ఇక్కడ నిర్వహించడం ఏమిటని, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో పాల్గొని చేతులు దులుపుకోవడం ఏమిటని, నిత్యం ప్రజా ఆరోగ్య పట్ల విశేషంగా కృషి చేస్తున్నా ఆశా కార్యకర్తలను కటిక నేలమీద కూర్చోబెట్టి మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించడం ఆశ కార్యకర్తలంటే అంత చులకనగా చూడటం వైద్య అధికారులకు తగదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు నిఖిత, వినోద్, తులసి, సిహెచ్ఓ శబ్దప్రకాశ్, హెచ్ ఈవో సంపత్, సూపర్ వైజర్ వెంకటలక్ష్మి, కనకయ్య, హెచ్ వి ఏలగోండమ్మ,
ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొనడంపై వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రజా ఆరోగ్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుల పనితీరుపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన జిల్లా, డివిజన్, మండలాల వైద్యుల శాఖ పరమైన క్రమశిక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు..

యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్

యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్

-గజ్వేల్ నియోజకవర్గంలో యువతి యువకులు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ సద్వినియోగం చేసుకోవాలి

కొండపాక యదార్థవాది

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులకు ఒక్కరికి కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే ఉద్దేశం తో గజ్వేల్ నియోజకవర్గంలో అర్హులైన అందరికి  రెండూ, నాలుగు చక్రాల వాహనాలకూ లైసెన్స్ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నాడని కొండపాక మండల బిఆరెస్ పార్టీ అధ్యక్షుడూ నూనె కుమార్ యాదవ్ పత్రిక ప్రకటనలో తెలిపారు.. ప్రతి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లకు ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, లేదా బర్త్ సర్టిఫికెట్, స్కూల్ బోనోఫైడ్ జిరాక్సులు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలని జులై 11వ తేదీ లోపు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవలని అన్నారు. 

కార్మికులను అన్ని విదాలుగా ఆదుకుంటాం

కార్మికులను అన్ని విదాలుగా ఆదుకుంటాం

పెద్దపల్లి యదార్థవాది

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పోలీసులు అన్ని వేళల తోడ్పాటు అందిస్తుందని ప్రతి కార్మికునికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డ్స్, కార్మికులందరు ఇన్సూరెన్స్ ఇచ్చేవిదంగా త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, శ్రీనివాస్, అశోక్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు..

ఐటీ పార్కు పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే

ఐటీ పార్కు పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే

– డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్

గోదావరిఖని యదార్థవాది

అమెరికా పర్యటన పేరుతో రామగుండం ఎమ్మెల్యే నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పర్యటన వల్ల స్థానిక యువతకు ఎలాంటి ఉపయోగం లేదని డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం నియోజకవర్గం అనేక పరిశ్రమలతో కేంద్ర బిందువుగా ఉందని,ఐటి పార్కు ఏర్పాటు చేయటం కంటే ముందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నిరుద్యోగ యువత మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్థానిక పరిశ్రమలైన ఆర్ ఎఫ్ సి ఎల్, తెలంగాణ పవర్ ప్లాంట్, ఎన్ టి పి సి, ఓ సి పి లలో శాశ్వత ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదో సమాధానం చెప్పాలన్నారు.ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల పేరుతో దళారుల చేతుల్లో మోసపోయిన వారికి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇప్పించ లేదో చెప్పాలనీ డిమాండ్ చేశారు.పోటీ పరీక్షలలో పాల్గొనే నిరుద్యోగ యువతకి ఇప్పటి వరకు లైబ్రరీ దిక్కులేదని, రానున్న ఎన్నికల దృష్ట్యా యువతను తప్పు దోవ పట్టించడానికి ఐటీ పార్కు పేరుతో ఎమ్మెల్యే పర్యటనలు చేస్తున్నాడని విమర్శించారు.

మెడికో విద్యార్థినికి సహాయం..

మెడికో విద్యార్థినికి సహాయం..

సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

గోదావరిఖని యదార్థవాది

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత కు మెడిసిన్ చదువు నిమిత్తం ప్రతినెలా అందించే సాయంలో భాగంగా రెండు వేల రూపాయల చెక్ ను గురువారం విద్యార్థిని తండ్రికి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అందించారు. అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో గత 18 నెలలుగా సాయి సుదీక్షిత కు ప్రతి నెల రెండు వేల రూపాయలను అందజేస్తున్నామని,ప్రతి ఒక్క సభ్యునికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి జూల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సమీకృత మార్కెట్.!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సమీకృత మార్కెట్.!

– త్వరగా నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి

– తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేశ్

గోదావరిఖని యదార్థవాది

తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని విటల్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేశ్ మాట్లాడుతూ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా నిర్మాణం కాక అసంపూర్తిగా మిగిలిపోయిందని, భవనానికి సంబంధించిన నిర్మాణ మెటీరియల్ మొత్తం దొంగల పాలవుతున్నదని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని, నిర్మాణం ఆగిపోవడంతో భవనము నిర్మానుషంగా మారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిర్మాణం ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగం అవుతుందని, మార్కెట్ అందుబాటులోకి వస్తే వ్యాపారస్తులకు,ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, మున్సిపల్ కార్పొరేషన్ కు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు.వెంటనే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకంటి చందర్ స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అల్లపు తిరుపతి,బాజా వెంకటేష్,కన్నం భానుచందర్, జి అఖిల్ వర్మ,చెరుకు పైడి, తగరం సాయిలు,సురేష్, రాజయ్య, మల్లయ్య,ఓదెలు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...