మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులను సమస్యలు పరిష్కరించాలి.
హైదరాబాద్ మార్చ్ 14, యదార్ధవాది ప్రతినిధి:
మల్లన్న సాగర్ బాధిత కుటుంబాలు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులు గురువారం హైదరాబాద్ సచివాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖను కలిశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని, ప్రభుత్వం స్పందించి, హామీలు అమలయ్యేలా చర్యలు చేపట్టి ఆదుకోవాలని వారంతా మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను ఓపికతో విన్న మంత్రి సిద్దిపేట కలెక్టర్ తో మాట్లాడి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.