మమతా బెనర్జీకి తీవ్ర గాయం..!
కోల్కతా మార్చ్ 14, యదార్థవాది ప్రతినిది:
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైందని పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సీఎం ప్రస్తుతం కోల్కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు..జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్షీల్డ్కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు..